రాహుల్గాంధీ యూఏఈ పర్యటన వాయిదా
- December 24, 2017
దుబాయ్: జనవరి 9న యూఏఈలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటన వాయిదా పడింది. కొన్ని ప్రత్యేక కారణాలతో వాయిదాపడ్డ ఈ పర్యటన, తిరిగి ఎప్పుడు చేపట్టేదీ త్వరలో తేలనున్నట్లు ఇన్కాస్ యూఏఈ కమ్యూనిటీ జనరల్ సెక్రెటరీ పున్నక్కన్ మొహమ్మద్ అలి చెప్పారు. ఇన్కాస్ ప్రెసిడెంట్ మహాదేవన్, అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 9 పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇంతలోనే రాహుల్ టూర్ వాయిదా పడినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టాక రాహుల్గాంధీ జీసీసీ దేశాల్లో తొలిసారిగా పర్యటించాల్సి ఉంది. రాహుల్ పర్యటనకు సంబంధించి ఎఐసిసికి సంబంధించి కొందరు ప్రముఖులు యూఏఈ వచ్చి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







