వాటికన్ సిటీలో వైభవంగా క్రిస్మస్ సంబరాలు...!!
- December 24, 2017
వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్ లో జరిగిన క్రిస్మస్ నైట్ మాస్ కు పోప్ ఫ్రాన్సిస్ ఐదో సారి నేతృత్వం వహించారు. బాల యేసును ముద్దాడి ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తల్లి పొత్తిళ్లలోకి చేర్చాడు. క్రిస్మస్ వేడుక సందర్భంగా వలసదారులకు మద్దతు ప్రకటించిన పోప్.. వాటికన్ తరలివచ్చిన విదేశీయులకు స్వాగతం పలికారు.
క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రీస్తు పుట్టుకకు సంబంధించిన కథలను పోప్ చదివి వినిపించారు. రోమన్ చక్రవర్తి జనాభా లెక్కలకు ఆదేశించడం వల్లే ఇష్టం లేకపోయినా.. క్రీస్తు తల్లిదండ్రులు మేరీ, జోసెఫ్, ఇంకా ఎన్నో వేల మంది నజ్రెత్ నుంచి బెత్లహాంకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జీసస్ కూడా సమాజం నుంచి దూరంగా బతకాల్సి వచ్చిందన్నారు. కొత్త సమాజం వలసలకు పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్ వలసదారులకు తన మద్దతు ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో క్రిస్మస్ వేడుకలకు దాదాపు పది వేల మంది తరలివచ్చారు. మిగతా వారందరూ చర్చి బయటే ఉండి సంబరాలను తిలకించారు. కట్టుదిట్టమైన భద్రతతో చర్చిలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల అందరినీ తనిఖీలు పూర్తి చేశారు.
క్రిస్మస్ వేడుకలకు కొన్ని గంటల ముందే వాటికన్ సిటీకి తరలివచ్చిన వారికి సెంటింట్ పీటర్స్ స్కేర్ దగ్గర పోప్ ఫ్రాన్సిస్ తన సందేశం వినిపించారు, ఫిలిప్పీన్స్లో ట్రెంబ్లిన్ తుఫాను బాధితుల కోసం ప్రార్థించారు. కొండచరియలు, వరదతో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం, విలయంలో నిరాశ్రుయలైన వారికి సంక్షేమం కోసం ప్రార్థించాలని సెంయింట్ పీటర్ స్క్వేర్లో వారికి సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







