క్రైస్తవుల విద్య, ఉపాధికి అధిక ప్రాధాన్యం: బాబు
- December 25, 2017
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు విజయవాడ: రాష్ట్రంలో క్రైస్తవుల విద్య, ఉపాధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విజయవాడలోని సెయింట్పాల్ కేథడ్రల్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. చర్చి బిషప్ జోసెఫ్ రాజారావు, ఇతర పాస్టర్లు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. తెలుగు ప్రజలకు, క్రైస్తవులకు ప్రభుత్వం తరపున చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏసుక్రీస్తు ఆశీర్వాదం అందజేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, తమ జీవితాన్ని సేవ కోసం అంకింతం చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







