దిల్లీ మెట్రో: మెజంటా లైన్ను ప్రారంభించిన మోదీ
- December 25, 2017

కేజ్రీవాల్కు అందని ఆహ్వానం.. యోగీ హాజరు దిల్లీ : దేశరాజధాని వాసులకు క్రిస్మస్ కానుక. దిల్లీ మెట్రో రైలు నెట్వర్క్లోని మెజెంటా లైన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం రైలులో కొద్ది దూరం ప్రయాణించారు. దేశరాజధానిని నోయిడాతో ఈ మార్గం కలుపుతోంది. 12.6 కి.మీ పొడవైన ఈ మార్గం దక్షిణ దిల్లీలోని కల్కాజీ నుంచి నోయిడాలోని బొటానికల్ గార్డెన్ వరకూ ఉంది. అయితే ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆహ్వనించలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి మోదీతోపాటు హాజరయ్యారు. దీనిపై ఆప్ నేతలు మండిపడ్డారు. రాజకీయ విబేధాల కారణంగానే కేజ్రీవాల్ను ఈ కార్యక్రమానికి పిలవలేదని దుయ్యబట్టారు. ఇది భాజపా నేతల చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ఏడాదిలో మోదీ మూడు మెట్రోలను ప్రారంభించారు. జూన్లో కొచ్చి మెట్రోను జాతికి అంకితం చేయగా..
నవంబర్లో హైదరాబాద్ మెట్రోను ఆవిష్కరించారు. ఇప్పుడు దిల్లీ మెట్రోలోని మరో మార్గాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







