దిల్లీ మెట్రో: మెజంటా లైన్ను ప్రారంభించిన మోదీ
- December 25, 2017

కేజ్రీవాల్కు అందని ఆహ్వానం.. యోగీ హాజరు దిల్లీ : దేశరాజధాని వాసులకు క్రిస్మస్ కానుక. దిల్లీ మెట్రో రైలు నెట్వర్క్లోని మెజెంటా లైన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం రైలులో కొద్ది దూరం ప్రయాణించారు. దేశరాజధానిని నోయిడాతో ఈ మార్గం కలుపుతోంది. 12.6 కి.మీ పొడవైన ఈ మార్గం దక్షిణ దిల్లీలోని కల్కాజీ నుంచి నోయిడాలోని బొటానికల్ గార్డెన్ వరకూ ఉంది. అయితే ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆహ్వనించలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి మోదీతోపాటు హాజరయ్యారు. దీనిపై ఆప్ నేతలు మండిపడ్డారు. రాజకీయ విబేధాల కారణంగానే కేజ్రీవాల్ను ఈ కార్యక్రమానికి పిలవలేదని దుయ్యబట్టారు. ఇది భాజపా నేతల చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ఏడాదిలో మోదీ మూడు మెట్రోలను ప్రారంభించారు. జూన్లో కొచ్చి మెట్రోను జాతికి అంకితం చేయగా..
నవంబర్లో హైదరాబాద్ మెట్రోను ఆవిష్కరించారు. ఇప్పుడు దిల్లీ మెట్రోలోని మరో మార్గాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







