జెట్ ఎయిర్ వేస్ డిస్కౌంట్ టిక్కెట్స్
- December 25, 2017
మస్కట్: ఇండియాకి చెందిన జెట్ ఎయిర్ వేస్, విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిస్కౌంట్ ధరలకే టిక్కెట్లు లభ్యం కానున్నట్లు జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై 20 శాతం రాయితీని అందించనున్నారు. ఒమన్ నుంచి ఇండియాకి వెళ్ళే విమానాల్లోనూ అలాగే బ్యాంగ్కాక్, కొలంబో, ఢాకా, హాంగ్కాంగ్, ఖాట్మండు, సింగపూర్లకు కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. లిమిటెడ్ పీరియడ్ సేల్ ఆఫర్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతాయి. టిక్కెట్లు పొందినవారు జనవరి 15 నుంచి ప్రయాణాలు చేసేందుకు వీలుంది. జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్, మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా రాయితీ టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన ఆఫర్ని విమాన ప్రయాణీకులు వినియోగించుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైయిది చెప్పారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!