జెట్ ఎయిర్ వేస్ డిస్కౌంట్ టిక్కెట్స్
- December 25, 2017
మస్కట్: ఇండియాకి చెందిన జెట్ ఎయిర్ వేస్, విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిస్కౌంట్ ధరలకే టిక్కెట్లు లభ్యం కానున్నట్లు జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై 20 శాతం రాయితీని అందించనున్నారు. ఒమన్ నుంచి ఇండియాకి వెళ్ళే విమానాల్లోనూ అలాగే బ్యాంగ్కాక్, కొలంబో, ఢాకా, హాంగ్కాంగ్, ఖాట్మండు, సింగపూర్లకు కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. లిమిటెడ్ పీరియడ్ సేల్ ఆఫర్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతాయి. టిక్కెట్లు పొందినవారు జనవరి 15 నుంచి ప్రయాణాలు చేసేందుకు వీలుంది. జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్, మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా రాయితీ టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన ఆఫర్ని విమాన ప్రయాణీకులు వినియోగించుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైయిది చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







