జెట్ ఎయిర్ వేస్ డిస్కౌంట్ టిక్కెట్స్
- December 25, 2017
మస్కట్: ఇండియాకి చెందిన జెట్ ఎయిర్ వేస్, విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిస్కౌంట్ ధరలకే టిక్కెట్లు లభ్యం కానున్నట్లు జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై 20 శాతం రాయితీని అందించనున్నారు. ఒమన్ నుంచి ఇండియాకి వెళ్ళే విమానాల్లోనూ అలాగే బ్యాంగ్కాక్, కొలంబో, ఢాకా, హాంగ్కాంగ్, ఖాట్మండు, సింగపూర్లకు కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. లిమిటెడ్ పీరియడ్ సేల్ ఆఫర్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతాయి. టిక్కెట్లు పొందినవారు జనవరి 15 నుంచి ప్రయాణాలు చేసేందుకు వీలుంది. జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్, మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా రాయితీ టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన ఆఫర్ని విమాన ప్రయాణీకులు వినియోగించుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైయిది చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల