సౌదీలో వరదలు : 12 కు పెరిగిన మృతుల సంఖ్య

- November 18, 2015 , by Maagulf
సౌదీలో వరదలు : 12 కు పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమ సౌదీ అరేబియాలో సంభవించిన వరదల వల్ల కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 641 మందిని కొట్టుకుపోకుండా కాపాడామని, 894 మందికి వసతి కల్పించామని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటలలో, వరదలో చిక్కుకున్న తమను కాపాడమని 3,823 సందేశాలను అందుకున్నామని, రక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేసామని కూడా వారు తెలిపారు. అల్ మదీనా లో అత్యధికంగా 22 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవగా, అల్ టారిఫ్, అల్ షిఫా, అల్ హయా, అల్ సఈల్ మరియు అల్ కబీర్ ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వాయువ్య సౌదీ అరేబియా లోని కొన్ని ప్రాంతాలలో వరుసగా మూడవ రోజు కూడా విశ్వ విద్యాలయాలు మూసివేయబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com