“శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం గడువు తేది పెంపు
- December 25, 2017
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా (1017-2017) 216 అడుగుల సమతా మూర్తి పంచలోహ విగ్రహ నిర్మాణాన్ని పురస్కరించుకుని, నేటి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో శ్రీ రామానుజాచార్య జీవిత ఇతివృత్తం, ఆయన సమాజంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఆవిష్కరించే విధంగా జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ (జీవ) మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ & సేవ్ టెంపుల్స్.ఆర్గ్(USA) సంయుక్త అద్వర్యంలో “శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఔత్సాహిక నిర్మాతల, దర్శకుల కోరికపై నిర్వాహకులు సానుకూలంగా స్పందించి ఈ చిత్రోత్సవ గడువు తేదిని 5 ఫిబ్రవరి 2018 వరకు పొడిగించడమైనదని సేవ్ టెంపుల్స్ ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
అలాగే ఈ చలన చిత్రోత్సవాన్ని 2018 ఫిబ్రవరి 22,23,24 తేదీలలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లోను, 2018 ఫిబ్రవరి 25వ తేదిన అవార్డుల ప్రదానోత్సవం శంషాబాద్ లోని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ ఆశ్రమం లోను జరిగే విధంగా తేదీలను మార్పుచేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!