గుండెపోటుతో ప్రముఖ వ్యాపారవేత్త మనోజ్ భాటియా మృతి
- December 26, 2017
మనామా: బహ్రెయిన్లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన తట్టయ్ హిందూ మర్కంటైల్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మనోజ్ భాటియా, ముంబైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బహ్రెయిన్లో ఆరు దశాబ్దాలపాటు ఆయన వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించారు. భాటియా కమ్యూనిటీ మెంబర్ అయిన మనోజ్, బహ్రెయిన్కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డ భారతీయుల్లో ప్రముఖుడు. తట్టయ్ హిందు మర్కంటైల్ కమ్యూనిటీ, మనోజ్ భాటియా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ ఫిలిప్పీన్స్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ ఫౌండర్ మెంబర్గా, బహ్రెయిన్ ఇండోనేసియా బిజినెస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ ఫౌండర్ మెంబర్గానూ బాధ్యతలు నిర్వహించారు. బహ్రెయిన్ బిజినెస్ అసోసియేషన్ బోర్డ్ మెంబర్గానూ బాధ్యతలు నిర్వహించారు. బహ్రెయిన్ ఆసియన్ ట్రేడర్స్ కమిటీ వైస్ ఛైర్మన్గానూ పనిచేశారాయన. బహ్రెయిన్ ఇండియా సొసైటీ బోర్డ్ మెఒబర్గా, ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ అడ్వయిజర్గానూ సేవలందించారు మనోజ్ భాటియా. నారాయణా హోల్డింగ్ కంపెనీ డబ్ల్యుఎల్ఎల్ గ్రూప్ ఛైర్మన్ అయిన మనోజ్, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







