గుండెపోటుతో ప్రముఖ వ్యాపారవేత్త మనోజ్ భాటియా మృతి
- December 26, 2017
మనామా: బహ్రెయిన్లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన తట్టయ్ హిందూ మర్కంటైల్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మనోజ్ భాటియా, ముంబైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బహ్రెయిన్లో ఆరు దశాబ్దాలపాటు ఆయన వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించారు. భాటియా కమ్యూనిటీ మెంబర్ అయిన మనోజ్, బహ్రెయిన్కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డ భారతీయుల్లో ప్రముఖుడు. తట్టయ్ హిందు మర్కంటైల్ కమ్యూనిటీ, మనోజ్ భాటియా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ ఫిలిప్పీన్స్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ ఫౌండర్ మెంబర్గా, బహ్రెయిన్ ఇండోనేసియా బిజినెస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ ఫౌండర్ మెంబర్గానూ బాధ్యతలు నిర్వహించారు. బహ్రెయిన్ బిజినెస్ అసోసియేషన్ బోర్డ్ మెంబర్గానూ బాధ్యతలు నిర్వహించారు. బహ్రెయిన్ ఆసియన్ ట్రేడర్స్ కమిటీ వైస్ ఛైర్మన్గానూ పనిచేశారాయన. బహ్రెయిన్ ఇండియా సొసైటీ బోర్డ్ మెఒబర్గా, ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ అడ్వయిజర్గానూ సేవలందించారు మనోజ్ భాటియా. నారాయణా హోల్డింగ్ కంపెనీ డబ్ల్యుఎల్ఎల్ గ్రూప్ ఛైర్మన్ అయిన మనోజ్, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







