ఒమన్లో వలసదారుల వీసా కోసం కొత్త 'ఇ-సర్వీస్'
- December 26, 2017
మస్కట్: మ్యాన్ పవర్ మినిస్ట్రీని సంప్రదించకుండానే యజమానులు వలస కార్మికుల్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా వన్ డే ఆన్లైన్ సర్వీస్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుల్తానేట్లో నివసిస్తోన్న నాన్ ఒమనీ వర్కర్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఈ సర్వీస్ వెసులుబాటు కల్పిస్తుంది. ఐదు రియాల్స్ ఫీజుతోనే ఈ సేవల్ని పొందడానికి వీలుంటుందని మినిస్ట్రీ ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. యజమాని ముందుగా ఇ-సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. 'మేన్ పవర్ సర్వీస్ ట్రాన్స్ఫర్'లో రిజిస్టర్ అయ్యాక, అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా సర్వీస్ అలర్ట్స్ యజమానికి సమాచారం అందుతుంది. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్లైన్ ద్వారా ఈ సేవలు పొందే వీలు కలగడం చాలా గొప్ప విషయమని ఓ ప్రైవేటు సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎస్ గుప్తా చెప్పారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!