యూఏఈలో జనవరి 1 నుండి టాక్స్ అమలు
- December 27, 2017
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెళ్లాలనుకుంటే.. ఇక కాస్తా ఎక్కువ డబ్బులు చేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇక నుంచి యూఏఈలో పర్యటించే పర్యాటకులపై వ్యాట్ పడనుంది. జనవరి 1, 2018 నుంచి హోటల్స్, రెస్టారెంట్స్, పర్యాటకం, ట్యాక్సీ సేవలు, ఆభరణాలు ఇతరత్రా సేవలపై దాదాపు 5శాతం వ్యాట్ను వసూలు చేసేందుకు అక్కడి అధికారులు రంగం సిద్ధం చేశారు. అంతర్జాతీయంగా చూసుకుంటే దుబాయ్ వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని దుబాయ్ టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. దాదాపు 1.8కోట్ల మంది భారతీయులు ఏటా యూఏఈలోని దుబాయ్, అబుదాబి ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు అత్యధికంగా దుబాయ్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తుంటారు. అంతేకాదు.. అక్కడ నుంచి భారీగా ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. కొత్త సంవత్సరం నుంచి యూఏఈ తీసుకొస్తున్న వ్యాట్ నిబంధనల ప్రకారం ఇక నుంచి భారతీయులు అక్కడ ఆభరణాలు కొనుగోలు చేస్తే..
5శాతం వ్యాట్ చెల్లించాల్సిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి చమురు ధరలు తగ్గిపోవడం యూఏఈ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా పుంజుకునేందుకు ఆ దేశం వివిధ సేవలపై 5శాతం వ్యాట్ను వసూలు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!







