కోటి రూపాయల స్కాం నిందితుడు.. వాషింగ్ మెషీన్లో చిక్కాడు
- December 27, 2017
చేసిన పాపం చెబితే పోతుందంటారు. మరి ఇతగాడు బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని విద్యార్థుల్ని మోసం చేసి కోటి రూపాయలు పోగేసుకుని ఎంచక్కా ఉడాయించాడు. 15 ఏళ్లుగా పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నా దొరక్కుండా పారిపోతున్నాడు. ముంబై జూహూ ప్రాంతానికి చెందిన మనోజ్ తివారీ 2002లో విద్యార్థులను ఎరగా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. బీఈడీ సీట్లను ఆశగా చూపించాడు. పెద్ద మొత్తంలో వసూలు చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. విద్యార్థులు జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు.
అయితే గత 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం జూహూ ప్రాంతంలో ఉన్న అతడి నివాసానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు ఇంట్లో అతడి కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అయితే వాషింగ్ మెషీన్ డోర్ దగ్గర కుప్పగా బట్టలు పడి ఉండడాన్ని గమనించారు. అనుమానం వచ్చి మెషీన్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో మనోజ్ కనిపించాడు. భార్యే అతడిని అందులో దాచిందని తెలుసుకున్న పోలీసులు అవాక్కయి అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!