అమెరికాలో కుంభకోణం, భారత సంతతి సూత్రధారి దేశబహిష్కరణ
- December 28, 2017
నైపుణ్యం గల విదేశీ ఉద్యోగుల కోసం సడలించిన హెచ్1బీ వీసా నిబంధనలను ఆధారంగా చేసుకుని రెండు కోట్ల డాలర్ల (రూ.128కోట్ల) కుం భకోణానికి పాల్పడిన భారత సం తతి వ్యక్తి రాజు కోసూరి(45)ని అమెరికా ప్రభుత్వం దేశబహిష్కరణ వేటు వేసింది. ఆయన కుటుంబాన్ని భారత్కు పంపించేసింది. హెచ్1బీ మార్గదర్శకాలను వినియోగించుకుని వీసా ఫర్ సేల్ వ్యవహారాన్ని కొన్నేండ్లుగా రాజు కోసూరి అనే వ్యక్తి నడుపుతూ వచ్చారని ఫెడరల్ కోర్టు నిర్ధారించడంతోపాటు అతడికి 28నెలల జైలుశిక్ష విధించారు. శిక్షాకాలం పూర్తవడంతో రాజును, ఆయన భార్య స్మృతి జరియాను, జన్మతః అమెరికన్ అయిన వారి కుమారుడిని భారత్కు పంపేశారు. వర్జీనియాకు చెందిన వ్యాపారవేత్త రాజు కోసూరి (45) పలు డొల్లకంపెనీలను నెలకొల్పి వాటి ద్వారా వేలాది మందికి దొంగదారిన హెచ్1బీ వీసాలు ఇప్పించారని తేలింది. దీంతో 28నెలలపాటు ఫెడరల్ జైలులో రాజు శిక్ష అనుభవించాడు. శుక్రవారం ఆయన విడుదలపై ఫెడరల్ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ రాజుపై తీవ్రమైన అభియోగాలు నిరూపించనందువల్లే తక్కువ శిక్ష పడిందని న్యాయమూర్తి లియోనీ బ్రింకెమా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







