పౌరుల్ని అలర్ట్‌ చేసిన బహ్రెయిన్‌ ఎంబసీ

- December 28, 2017 , by Maagulf
పౌరుల్ని అలర్ట్‌ చేసిన బహ్రెయిన్‌ ఎంబసీ

మనామా: ఇండోనేసియాలోని సమత్రా దీవుల్లోగల అగ్ని పర్వతం యాక్టివ్‌గా మారడంతో జకార్తాలోని బహ్రెయిన్‌ ఎంబసీ తమ పౌరులను అలర్ట్‌ చేసింది. పొగతో కూడిన మేఘాల, అలాగే ప్రమాదకర వాయువులు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని 'అలర్ట్‌'లో పేర్కొంది. ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ ఎంబసీ హాట్‌లైన్స్‌ని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 3.36 నిమిషాల సమయంలో అగ్నిపర్వతం పేలిందనీ, 8 నిమిషాలపాటు పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్‌ తర్వాత ఈ స్థాయిలో అగ్ని పర్వతం బద్ధలవడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com