పాక్ వీసాలను తిరస్కరించిన భారత్
- December 30, 2017
హజ్రత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా ఉత్సవాల కోసం వచ్చే పాకిస్థాన్ యాత్రికుల వీసాలను భారత్ తిరస్కరించిందని పాక్ విదేశాంగ శాఖ వర్గాలు శనివారం తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి 1వ తేది నుంచి 8వ తేది వరకు దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఉర్సు వేడుకలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనడానికి పాకిస్థాన్ నుంచి 192 మంది యాత్రికులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ భారత్ వారికి వీసాలను ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో వారి పర్యటనను పాకిస్థాన్ చివరినిమిషంలో వాయిదా వేసిందని విదేశాంగ శాఖ అధికారి పేర్కొన్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్కు చెందిన భక్తులు అత్యంత పవిత్రమైన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన 1974 భారత్-పాకిస్థాన్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా జరుగుతోంది. హజ్రత్ నిజాముద్దీన్ఔలియా దర్గాలో జరిగే ఉర్సు వేడుకలను రెండు దేశాల మధ్య మత సామరస్యానికి చిహ్నంగా భావిస్తారు. కానీ భారత్ ఇందుకోసం వచ్చే పాక్ యాత్రికుల వీసాలను తిరస్కరించడం దురదృష్టకరమని ఆ దేశ విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. పాక్ జైలులో బందీగా ఉన్న కులభూషణ్ యాదవ్ను కలిసేందుకు వెళ్లిన అతని తల్లి, భార్య పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ యాత్రికుల వీసాల విషయంలో భారత్ కఠిన వైఖరి తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







