ఫ్రాన్స్ లో 22 భారతీయ మైనర్ల అదృశ్యం
- December 30, 2017
రగ్బీ శిక్షణ కోసం ఫ్రాన్స్కు వెళ్లిన 22 మంది భారతీయ మైనర్లు అదృశ్యమయ్యారు. ఘటనకు కారకులైన ట్రావెల్ ఏజెంట్ల పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెంచ్ ఫెడరేషన్ ఆఫ్ పారిస్ ఆహ్వానం పై 25 మంది మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్ ఏజెంట్లు పారిస్కు తీసుకెళ్లారు. ఇందుకుగాను మైనర్ల తల్లిదండ్రుల నుండి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. పారిస్కు వారిని తీసుకెళ్లిన తర్వాత ఒక వారం పాటు రగ్బీ ట్రైనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేశారు.
కానీ వారి తిరుగు ప్రయాణానికి ట్రావెల్ ఏజెంట్లు టికెట్లు రద్దు చేశారు. కాగా ఇద్దరు పిల్లలు మాత్రం ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే మిగతా వారిని స్థానిక గురుద్వారాలో ఉంచినట్టు సమాచారం. అందులో ఒకరిని ఫ్రెంచ్ పోలీసులు పట్టుకొని ఇంటర్పోల్కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఇంటర్పోల్..సీబీఐకి తెలిపింది. దీంతో సీబీఐ విచారణ ప్రారంభించింది. ట్రావెల్ ఏజెంట్లలో ఫరీదాబాద్కు చెందిన లలిత్ డేవిడ్ డీన్, ఢిల్లీకి చెందిన సంజరు రారు, వరుణ్ చౌదరీల నుండి సీబీఐ పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







