కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
- December 31, 2017
సెంట్రల్ కెన్యాలో ఆదివారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించగా మరో 16 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సెంట్రల్ కెన్యాలో నకురు పట్టణం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒక బస్సు, లారీ ఢకొీన్న ఈ ప్రమాదంలో 30 మంది మర ణించారని రిఫ్ట్ వ్యాలీ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ జెరో అరోమ్ చెప్పారు. శిథిలాల నుండి మృతదేహాలను తొలగించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన వివరిం చారు. కెన్యా పశ్చిమ ప్రాంతంలోని బుసియా నుండి ఈ బస్సు ప్రయాణిస్తున్న నకురు ఎల్డోరెట్ హైవైపై ప్రమాదకరమైన మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. ఈ మలుపు వద్ద ఈ నెలరోజుల వ్యవధిలో జరిగిన ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య 100కు చేరిందన్నారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







