కూలిన విమానం, 12 మంది మృతి
- January 01, 2018
కోస్టారికా దేశం జానాకాస్ట్ ప్రావిన్స్లోని పర్వతాల్లో ఓ చిన్న విమానం కూలిపోవడంతో 12 మంది చనిపోయారు. వీరిలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు. సెస్నా 208బీ అనే చిన్న విమానం పది మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నాం 12.10 గంటలకు నండయూర్లోని పుంటా ఇస్లిటా ఎయిర్ పోర్టు నుంచి రాజధాని నగరం శాన్ జోస్కు బయలుదేరింది.
10 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైనట్లు సివిల్ ఏవియేషన్ అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అయ్యాకే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోస్టారికా అధ్యక్షుడు సోలిస్ రివేరా సంతాపం తెలిపారు. మృతులకు సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







