కూలిన విమానం, 12 మంది మృతి
- January 01, 2018
కోస్టారికా దేశం జానాకాస్ట్ ప్రావిన్స్లోని పర్వతాల్లో ఓ చిన్న విమానం కూలిపోవడంతో 12 మంది చనిపోయారు. వీరిలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు. సెస్నా 208బీ అనే చిన్న విమానం పది మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నాం 12.10 గంటలకు నండయూర్లోని పుంటా ఇస్లిటా ఎయిర్ పోర్టు నుంచి రాజధాని నగరం శాన్ జోస్కు బయలుదేరింది.
10 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైనట్లు సివిల్ ఏవియేషన్ అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అయ్యాకే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోస్టారికా అధ్యక్షుడు సోలిస్ రివేరా సంతాపం తెలిపారు. మృతులకు సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







