68 గ్యాస్ స్టేషన్ల సీజ్
- January 01, 2018
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ (ఎంసిఐ), కింగ్డమ్లో మొత్తం 68 ఫ్యూల్ స్టేషన్స్ని సీజ్ చేసినట్లు వెల్లడించింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆదివారం రాత్రి పెట్రోల్ అమ్మకాల్ని నిలిపివేసినందుకుగాను ఈ ఫ్యూయల్ స్టేషన్లను సీజ్ చేయడం జరిగిందని ఎంసిఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 1,597 ఫ్యూయల్ స్టేషన్లను తనిఖీ చేసి, నిబంధనల్ని ఉల్లంఘించిన ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎంసిఐ తరఫున తనిఖీలు జరుగుతూనే ఉంటాయనీ, ధరల మోసాలకి పాల్పడినా, ట్యాంపరింగ్కి పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎంసిఐ ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకుల్ని హెచ్చరించింది. కొన్ని ఫ్యూయల్ స్టేషన్లను ముందస్తుగా మూసివేయడంతో మిగతా స్టేషన్లలో వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకులు చూపిన అత్యుత్సాహం సీజ్ దాకా వెళ్ళింది, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో