ఊచకోతకు పాల్పడ్డ ఆర్మీ మాజీ ఆఫీసర్
- January 02, 2018
పల్వాల్ : హర్యానాలో దారుణం జరిగింది. పల్వాల్లో ఆర్మీ మాజీ ఆఫీసర్ ఊచకోతకు పాల్పడ్డాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒక ఐరన్ రాడ్డుతో ఆరుగుర్ని కొట్టి చంపాడు. పల్వాల్లో ఈ హత్యాకాండ చోటుచేసుకున్నది. ప్రస్తుతం వ్యవసాయశాఖలో సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల నరేశ్ కదియన్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ హత్యలు జరిగినట్లు తేల్చారు. నరేశ్ గత కొన్నాళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. భార్యా పిల్లలు ప్రస్తుతం నరేశ్కు దూరంగా ఉంటున్నారు. 2003లో ఆర్మీ లెఫ్టినెంట్ ఉద్యోగం నుంచి నరేశ్ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2015లోనూ ఓ పోలీస్ కానిస్టేబుల్తో ఆయన గొడవకు దిగారు. ఇవాళ చనిపోయినవారిలో ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!







