ఊచకోతకు పాల్పడ్డ ఆర్మీ మాజీ ఆఫీసర్
- January 02, 2018
పల్వాల్ : హర్యానాలో దారుణం జరిగింది. పల్వాల్లో ఆర్మీ మాజీ ఆఫీసర్ ఊచకోతకు పాల్పడ్డాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒక ఐరన్ రాడ్డుతో ఆరుగుర్ని కొట్టి చంపాడు. పల్వాల్లో ఈ హత్యాకాండ చోటుచేసుకున్నది. ప్రస్తుతం వ్యవసాయశాఖలో సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల నరేశ్ కదియన్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ హత్యలు జరిగినట్లు తేల్చారు. నరేశ్ గత కొన్నాళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. భార్యా పిల్లలు ప్రస్తుతం నరేశ్కు దూరంగా ఉంటున్నారు. 2003లో ఆర్మీ లెఫ్టినెంట్ ఉద్యోగం నుంచి నరేశ్ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2015లోనూ ఓ పోలీస్ కానిస్టేబుల్తో ఆయన గొడవకు దిగారు. ఇవాళ చనిపోయినవారిలో ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం









