ఊచకోతకు పాల్పడ్డ ఆర్మీ మాజీ ఆఫీసర్
- January 02, 2018
పల్వాల్ : హర్యానాలో దారుణం జరిగింది. పల్వాల్లో ఆర్మీ మాజీ ఆఫీసర్ ఊచకోతకు పాల్పడ్డాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒక ఐరన్ రాడ్డుతో ఆరుగుర్ని కొట్టి చంపాడు. పల్వాల్లో ఈ హత్యాకాండ చోటుచేసుకున్నది. ప్రస్తుతం వ్యవసాయశాఖలో సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల నరేశ్ కదియన్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ హత్యలు జరిగినట్లు తేల్చారు. నరేశ్ గత కొన్నాళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. భార్యా పిల్లలు ప్రస్తుతం నరేశ్కు దూరంగా ఉంటున్నారు. 2003లో ఆర్మీ లెఫ్టినెంట్ ఉద్యోగం నుంచి నరేశ్ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2015లోనూ ఓ పోలీస్ కానిస్టేబుల్తో ఆయన గొడవకు దిగారు. ఇవాళ చనిపోయినవారిలో ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







