గజల్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..
- January 02, 2018
లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న పనిమనిషి పార్వతిని విచారణకు హాజరు కావాలని పిలిచారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత వరకు ఉందనే దానిపై ఆరా తీయనున్నారు. ప్రధానంగా బాధితురాలు పార్వతిపై ఆరోపణలు చేసింది. తనను గజల్ శ్రీనివాస్తో గడపాలని ఒత్తిడి చేసిందని చెప్పింది. దీనిపైనా ఆమెను ప్రశ్నించనున్నారు. అలాగే ఆలయ వాణి మాజీ ఉద్యోగుల్ని కూడా విచారణకు హాజరు కావాలని పిలిచినట్లు తెలుస్తోంది. ఇటు గజల్ బెయిల్ పిటిషన్, పోలీసు కస్టడీ పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న గజల్ను ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. అందుకే అతడ్ని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంకా బాధితులెవరైనా ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయొచ్చంటున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి