బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ రేంజర్ల హతం

- January 04, 2018 , by Maagulf
బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ రేంజర్ల హతం

జమ్ము కాశ్మీర్:జమ్ము కాశ్మీర్ సాంబా సెక్టార్‌లో రెచ్చిపోతున్న పాక్ రేంజర్లకు బీఎస్ఎఫ్ దళాలు గట్టిగా జవాబు చెప్పాయి. ఎల్‌ఓసీలోని మూడు పాక్ పోస్టులను ధ్వంసం చేసిన భారత జవాన్లు 12 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టారు. బుధవారం నుంచి సాంబా సెక్టార్‌లో పాక్‌ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. వారి కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఒక జవాన్ కూడా అమరుడయ్యాడు. దీంతో ఉదయం పాక్ పోస్టులపై విరుచుకుపడ్డ బీఎస్‌ఎఫ్ జవాన్లు విధ్వంసం సృష్టించారు.

ఉదయం ఐదున్నర నుంచి ఎల్‌ఓసీలో భారత జవాన్లు కాల్పులు ప్రారంభించారు. పాక్ వైపు నుంచి వచ్చిన మూడు మోర్టార్ పొజిషన్స్ గుర్తించిన జవాన్లు వాటిని టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపించాయి. ధ్వంసం చేశాయి. ఎల్‌ఓసీ లోంచి భారత్‌లోకి చొరబడుతున్నఒకరిని కాల్చిచంపాయి. బీఎస్ఎఫ్ కాల్పుల్లో 12 మంది పాక్ రేంజర్లు హతమైనట్టు సరిహద్దు భద్రతా దళం ప్రతినిధి ప్రకటించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com