బీఎస్ఎఫ్ కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ రేంజర్ల హతం
- January 04, 2018
జమ్ము కాశ్మీర్:జమ్ము కాశ్మీర్ సాంబా సెక్టార్లో రెచ్చిపోతున్న పాక్ రేంజర్లకు బీఎస్ఎఫ్ దళాలు గట్టిగా జవాబు చెప్పాయి. ఎల్ఓసీలోని మూడు పాక్ పోస్టులను ధ్వంసం చేసిన భారత జవాన్లు 12 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టారు. బుధవారం నుంచి సాంబా సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. వారి కాల్పుల్లో బీఎస్ఎఫ్కు చెందిన ఒక జవాన్ కూడా అమరుడయ్యాడు. దీంతో ఉదయం పాక్ పోస్టులపై విరుచుకుపడ్డ బీఎస్ఎఫ్ జవాన్లు విధ్వంసం సృష్టించారు.
ఉదయం ఐదున్నర నుంచి ఎల్ఓసీలో భారత జవాన్లు కాల్పులు ప్రారంభించారు. పాక్ వైపు నుంచి వచ్చిన మూడు మోర్టార్ పొజిషన్స్ గుర్తించిన జవాన్లు వాటిని టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపించాయి. ధ్వంసం చేశాయి. ఎల్ఓసీ లోంచి భారత్లోకి చొరబడుతున్నఒకరిని కాల్చిచంపాయి. బీఎస్ఎఫ్ కాల్పుల్లో 12 మంది పాక్ రేంజర్లు హతమైనట్టు సరిహద్దు భద్రతా దళం ప్రతినిధి ప్రకటించారు
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







