ప్రధాని మోడీని కలిసిన ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు
- January 05, 2018
విభజన చట్టంలోని అంశాలను వేగంగా అమలు చేయాలని ప్రధాని మోడీని కోరారు ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు.. ముఖ్యంగా రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీ, అసెంబ్లీ స్థానల పెంపు లాంటి అంశాలను ప్రధాని ముందు ఉంచింది ఎంపీల బృందం..
2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటు 7500 కోట్ల రూపాయలకు గాను, 3979 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఇఏపీ ప్రాజెక్టులకు రుణాల రూపంలో నిధులు ఇప్పించాలని కోరారు. మరోవైపు ఏపీ భవన్ విభజన వేగవంతం చేయాలని కోరారు..
ఇద్దరు మంత్రులు, 14 మంది ఎంపీలు ప్రధాని మోడిని కలిసి.. 16 పేజీల మెమోరాండాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. వెంటనే ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శికి మెమోరాండాం ప్రతిని ఇచ్చి... ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ముందు ప్రధాని స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!