ఫిబ్రవరి మొదటి వారం నుంచి 'సైరా..' రెండో షెడ్యూల్ మొదలు

- January 06, 2018 , by Maagulf
ఫిబ్రవరి మొదటి వారం నుంచి 'సైరా..' రెండో షెడ్యూల్ మొదలు

చిరంజీవి చారిత్రక చిత్రం 'సైరా..నరసింహారెడ్డి' షూటింగ్ స్పీడ్ పెంచబోతున్నారు. వరుస షెడ్యూల్స్‎లో ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉందట చిరు అండ్ టీమ్.

చిరంజీవి ప్రిస్టేజియస్ హిస్టారికల్ డ్రామా 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్‎లో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది.. ఈ షెడ్యూల్‎లో క్లైమాక్స్ ఘట్టాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారట. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న 'సైరా' టీమ్ ఫిబ్రవరి మొదటి వారంలో రెండో షెడ్యూల్‎కు సిద్ధమవుతోంది. పొల్లాచ్చిలో జరగనున్న సెకండ్ షెడ్యూల్‎లో గ్రామీణ వాతావరణానికి సంబంధించిన సీన్స్‎ను చిత్రీకరించనున్నారట. హీరోయిన్ నయనతార కూడా ఈ షెడ్యూల్ లోనే 'సైరా..' యూనిట్ లో జాయిన్ కాబోతుందట.

పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయిన తర్వాత గ్యాప్ లేకుండా వెంటనే హైదరాబాద్‎లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిందట 'సైరా..' యూనిట్. అందులో బ్రిటీష్ సామ్రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. దీనికి సంబంధించిన సెట్స్‎ను ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సిద్ధం చేస్తున్నారు కూడా. ఆ షెడ్యూల్ లోనే అమితాబ్ బచ్చన్, సుదీప్ పాల్గొంటారట. అలా వరుస షెడ్యూల్స్‎లో 'సైరా..' పూర్తి చేసి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది నిర్మాత రామ్‎చరణ్ ఆలోచనట.

ఇదిలా ఉంటే టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి-మోహన్ బాబు- రాజశేఖర్ మధ్య సయోధ్య మరోసారి బయటపడింది. అప్పుడప్పుడూ తమ మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చినా తామంతా ఒక్కటే అని మరోసారి నిరూపించారు ఈ సీనియర్ స్టార్స్. ఇటీవల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎమ్.పి. సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన విందులో వీరంతా ఎంతో ఉత్సాహంగా సందడి చేశారు. తమ స్నేహ బంధాన్ని చాటుకున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com