అందరి మెప్పును పొందుతున్నమార్పు
- January 07, 2018
'ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది' అన్నట్టుగానే దుబాయ్ ని పరిపాలించే రాజు తన ఆలోచనతో సమాజంలో పెను మార్పుకు కారణమయ్యారు.
వికలాంగులు తమ మనోధైర్యంతో ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు మరియు దేశ ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారు.. అంగవైకల్యం శరీరానికే గానీ మనసుకీ, మేధాశక్తికీ కాదని, వారికున్న మనోనిబ్బరం ఎంతో మెచ్చుకోతగ్గదని.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ ప్రధానమంత్రి అయినటువంటి దుబాయ్ రారాజు 'HH Sheikh Mohammed bin Rashid Al Maktoum' ఇకపై వికలాంగులను 'People of Determination' అని సంభోదించాలి అని నిర్దేశించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సదా ఆదర్శనీయమని, హర్షించదగ్గదని ప్రజలు వేయి నోళ్ళ కొనియాడుతున్నారు.
అన్ని బహిరంగ ప్రదేశాలలో, ఎయిర్పోర్ట్ లలో కూడా 'People of Determination' బోర్డులను చూసి రాజు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
కాగా వికలాంగులను 'దివ్యాంగులు' గా సంభోదించాలి అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించడం గమనార్హం. ఇరు దేశాల ప్రధానమంత్రులు తీసుకున్న ఈ నిర్ణయాలు అభినందనీయలే..ఏమంటారు?
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







