గుండు హనుమంతరావుకి సాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం

- January 08, 2018 , by Maagulf
గుండు హనుమంతరావుకి సాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం

ఒకప్పుడు కామెడీతో అలరించిన గుండు హనుమంతరావు ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, ఈ మధ్య ఓ కార్యక్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. ప్రస్తుతం తాను కష్టాలలో ఉన్నట్టు కూడా తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి గుండు హనుమంతరావుకి 2లక్షల రూపాయల చెక్ ను ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదుని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదల చేసింది. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ గుండు హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుండుకి వారంలో మూడు సార్లు డయాలసిస్ జరగాల్సి ఉండగా, చికిత్సకి అవసరమైన సొమ్ము లేకపోవడంతో ఇంట్లోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడట. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ కమెడీయన్ కి సాయం అందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com