ఫేస్బుక్ సంచలన నిర్ణయం
- January 09, 2018
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన విర్చ్యువల్ అసిస్టెంట్ 'ఎం'ను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఫేస్బుక్ మెస్సెంజర్లోని ఒక టెక్ట్స్ రోబోట్. ఈ వీఆర్ ఎం ను ఫేస్బుక్ 2015 ఆగస్టులో ప్రారంభించింది. దాదాపు రెండున్నరేళ్లపాటు సేవలందించిన దీనికి త్వరలో వీడ్కోలు పలకనున్నారు. 2018 జనవరి 19 వీఆర్ ఎం కు చివరి రోజు కానుంది. ప్రజల అవసరాలను తెలుసుకోవడానికి దీనిని తయారు చేశామని, తద్వారా ఫేస్బుక్ చాలా విషయాలను తెలుసుకుందని యంత్రాంగం తెలిపింది.
ఫేస్బుక్లోని ఇతర విభాగాల్లో ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటామని ఫేస్బుక్ తెలిపింది. అంతేకాకుండా మరో కీలక ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం 'ఎం' 2వేల మందికి మాత్రమే ఉపయోగకరంగా ఉందని, దీనిని మరింత అభివృద్ధి పరిచి అందరికీ ఉపయోగ పడేలా తిరిగి బీటా వెర్షన్లో తీసుకువస్తామని ప్రకటించింది. మానవ మేధా శక్తితో సమానంగా ఉండగలిగి మరింత మందికి చేరువయ్యేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







