మనామా:ఘనంగా ప్రవాసి భారతీయ దివస్
- January 10, 2018
మనామా: ఇండియన్ కమ్యూనిటీ, ప్రవాసి భారతీయ దివస్ని ఘనంగా నిర్వహించింది. ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ అంబాసిడర్ అలోక్కుమార్ సిన్హా, ఎంబజీ సిబ్బంది కమ్యూనిటీ మెంబర్స్కి సీఫ్లోని ఎంబసీ పరిసరాల్లోకి ఆహ్వానించారు. బ్రాండ్ ఇండియాని విదేశాల్లో చాటి చెబుతున్నందుకుగాను కమ్యూనిటీ మెంబర్స్ని ఇండియన్ అంబాసిడర్ అభినందించారు. సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చాక, మహాత్మాగాంధీ ఫ్రీడమ్ స్ట్రగుల్ని కొత్త మలుపు తిప్పారనీ, స్వాతంత్య్రం సిద్ధించాక దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని అలోక్కుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిలో ఎన్నారైలు కీలక భూమిక పోషిస్తున్నారనీ, ఈ బంధం ఇంకా గొప్పగా కొనసాగాలని ఆకాంక్షించారాయన. ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ ఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వంతో విదేశాల్లోని భారతీయుల బంధం మరింత బలపడేలా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!









