మనామా:ఘనంగా ప్రవాసి భారతీయ దివస్‌

- January 10, 2018 , by Maagulf
మనామా:ఘనంగా ప్రవాసి భారతీయ దివస్‌

మనామా: ఇండియన్‌ కమ్యూనిటీ, ప్రవాసి భారతీయ దివస్‌ని ఘనంగా నిర్వహించింది. ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్‌ అంబాసిడర్‌ అలోక్‌కుమార్‌ సిన్హా, ఎంబజీ సిబ్బంది కమ్యూనిటీ మెంబర్స్‌కి సీఫ్‌లోని ఎంబసీ పరిసరాల్లోకి ఆహ్వానించారు. బ్రాండ్‌ ఇండియాని విదేశాల్లో చాటి చెబుతున్నందుకుగాను కమ్యూనిటీ మెంబర్స్‌ని ఇండియన్‌ అంబాసిడర్‌ అభినందించారు. సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చాక, మహాత్మాగాంధీ ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌ని కొత్త మలుపు తిప్పారనీ, స్వాతంత్య్రం సిద్ధించాక దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని అలోక్‌కుమార్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిలో ఎన్నారైలు కీలక భూమిక పోషిస్తున్నారనీ, ఈ బంధం ఇంకా గొప్పగా కొనసాగాలని ఆకాంక్షించారాయన. ఇండియన్‌ ఎంబసీ సెకెండ్‌ సెక్రెటరీ ఆనంద్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ, భారత ప్రభుత్వంతో విదేశాల్లోని భారతీయుల బంధం మరింత బలపడేలా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com