కూలిన హెలికాప్టర్, ఐదుగురు మృతి
- January 13, 2018మహారాష్ట్రలో శనివారం ఓ రోడ్డు ప్రమాదం, పడవ ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం జరిగాయి. ఈ ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) సిబ్బంది ఐదుగురు, ఇద్దరు పైలట్లతో ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ ముంబై తీరప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఉదయం 10.30 గంటలకు జుహు ఎరోడ్రోమ్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే అదృశ్యమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఓఎన్జీసీ.. ముంబై తీరప్రాంత సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో నౌకదళం, ఓఎన్జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!