మెదడుకు యవ్వన ‘బీట్’!
- January 13, 2018
మెదడు చురుకుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే వ్యాయామం చేయటానికి ముందు కాస్త బీట్రూట్ రసం తాగి చూడండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల విషయగ్రహణ సామర్థ్యం, భావోద్వేగాలు, కదలికలతో ముడిపడిన మెదడు భాగాలు ఆరోగ్యంగా ఉంటున్నట్టు వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. బీట్రూట్లో నైట్రేట్ దండిగా ఉంటుంది. ఇది వ్యాయామం చేసేప్పుడు త్వరగా అలసిపోకుండా చూడటానికి, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో మెదడు క్షీణించటమూ తగ్గుతుంది. అంటే మెదడు ఆయుష్షు కూడా పెరుగుతుందన్నమాట. నైట్రిక్ ఆక్సైడ్ చాలా శక్తిమంతమైంది. ఇది మన శరీరంలో ఆక్సిజన్ అవసరమైన భాగాల్లోకి చొచ్చుకొని వెళ్తుంది. ఆక్సిజన్ను పెద్దమొత్తంలో వినియోగించుకునే అవయవం మెదడే. కాబట్టి ఇది మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేస్తుంది. బీట్రూట్లోని నైట్రేట్ ముందు నైట్రైట్గానూ, అనంతరం నైట్రిక్ ఆక్సైడ్గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. బీట్రూట్ రసంతో రక్తపోటు తగ్గుతున్నట్టు గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది. ఇది కూడా మెదడుకు మేలు చేసేదే. కాబట్టి బీట్రూట్ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా