కూలిన హెలికాప్టర్, ఐదుగురు మృతి
- January 13, 2018
మహారాష్ట్రలో శనివారం ఓ రోడ్డు ప్రమాదం, పడవ ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం జరిగాయి. ఈ ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) సిబ్బంది ఐదుగురు, ఇద్దరు పైలట్లతో ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ ముంబై తీరప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఉదయం 10.30 గంటలకు జుహు ఎరోడ్రోమ్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే అదృశ్యమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఓఎన్జీసీ.. ముంబై తీరప్రాంత సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో నౌకదళం, ఓఎన్జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









