కూలిన హెలికాప్టర్, ఐదుగురు మృతి

- January 13, 2018 , by Maagulf
కూలిన హెలికాప్టర్, ఐదుగురు మృతి

మహారాష్ట్రలో శనివారం ఓ రోడ్డు ప్రమాదం, పడవ ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం జరిగాయి. ఈ ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) సిబ్బంది ఐదుగురు, ఇద్దరు పైలట్‌లతో ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ ముంబై తీరప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఉదయం 10.30 గంటలకు జుహు ఎరోడ్రోమ్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే అదృశ్యమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఓఎన్‌జీసీ.. ముంబై తీరప్రాంత సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో నౌకదళం, ఓఎన్‌జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com