డ్రైవింగ్ టెస్ట్ కోసం లంచం: మహిళకు జైలు
- January 15, 2018
అరబ్ మహిళ ఒకరు, 500 దిర్హామ్లతోపాటు, చాక్లెట్లు ఇచ్చి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యేందుకు ప్రయత్నించగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 5000 దిర్హామ్ల జరీమానా, డిపోర్టేషన్ కూడా ఆమెకు వర్తిస్తుంది. ఏడుసార్లు ఆ మహిళ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అవడంతో, ఓ మహిళా ఉద్యోగికి లంచం ఇచ్చి టెస్ట్ పాస్ అవ్వాలనుకుంది. లంచం విషయమై మహిళా అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. అయితే విచారణలో నిందితురాలు, బహుమతిగా మాత్రమే వాటిని ఇచ్చాననీ, అందుకు ప్రతిఫలంగా తాను ఏమీ కోరలేదని పేర్కొంది. తాను అన్యాయంగా ఈ కేసులో ఇరికింపబడ్డానని నిందితురాలు బుకాయించినా, న్యాయస్థానం మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చి, ఆమెను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







