పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నటి అమలాపాల్

- January 16, 2018 , by Maagulf
పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నటి అమలాపాల్

ప్రముఖ నటి అమలాపాల్‌ నిన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఓ  కారు వ్యవహారం లో ఆమె పోలీస్ విచారణ నిమిత్తం స్టేషన్ లో సరెండర్ అయ్యారు. అసలు వివరాల్లోకి వెళ్తే నటి అమలాపాల్‌ కొత్తగా రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన కారును పుదేచ్చేరిలో రిజిస్టర్‌ చేయించుకుంది.అక్కడ రోడ్డు రవాణా శాఖ పన్ను తక్కువ ఉండడమే అందుకు కారణం.అయితే పుదుచ్చేరిలో రిజిస్టర్‌ చేయించుకున్న కారును కేరళాలో పన్ను కట్టకుండా నడపడంతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖకు నష్టం కలిగిందట. దాంతో అమలాపాల్‌పై కేరళలో సెక్షన్ 430, 468, 471 కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఇటీవల కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ కేసును తర్వాత పరిశీస్తామని చెప్పిన కోర్టు, అమలాపాల్‌ని వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com