యూఏఈలో ఖతారీ షేక్‌ నిర్బంధం

- January 16, 2018 , by Maagulf
యూఏఈలో ఖతారీ షేక్‌ నిర్బంధం

దోహా: ఖతార్‌ రాయల్‌ ఫ్యామిలీకి చెందిన సభ్యుడొకరు, తాను యూఏఈలో నిర్బంధానికి గురైనట్లు ఆరోపిస్తున్నారు. వివాదాస్పదుడిగా ఈ ఖతారీ షేక్‌పై ఆరోపణలున్నాయి. షేక్‌ అబ్దుల్లా బిన్‌ అలి అల్‌ థని, దోహాతో అబుదాబీ - రియాద్‌ సంబంధాలు తెంచుకున్నాక మీడియేటర్‌గా తెరపైకొచ్చారు. ఖతార్‌కి చెందిన అల్‌ జజీరా టెలివిజన్‌ ప్రసారం చేసిన వీడియోలో, షేక్‌ ఓ కుర్చీలో కూర్చుని ఉన్నట్లుగా తెలియజేస్తోంది. అబుదాబీలో ఉన్న తనకు ఏమైనా జరిగితే ఖతార్‌కి చెడ్డ పేరు వస్తుందనీ, తాను యూఏఈ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌కి అతిథినని చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఖతార్‌ ప్రజలు అమాయకులని అందులో షేక్‌ పేర్కొన్నారు. తనకు ఏం జరిగినా దానికి షేక్‌ మొహ్మద్‌ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు షేక్‌ అబ్దుల్లా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com