యూఏఈలో ఖతారీ షేక్ నిర్బంధం
- January 16, 2018
దోహా: ఖతార్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడొకరు, తాను యూఏఈలో నిర్బంధానికి గురైనట్లు ఆరోపిస్తున్నారు. వివాదాస్పదుడిగా ఈ ఖతారీ షేక్పై ఆరోపణలున్నాయి. షేక్ అబ్దుల్లా బిన్ అలి అల్ థని, దోహాతో అబుదాబీ - రియాద్ సంబంధాలు తెంచుకున్నాక మీడియేటర్గా తెరపైకొచ్చారు. ఖతార్కి చెందిన అల్ జజీరా టెలివిజన్ ప్రసారం చేసిన వీడియోలో, షేక్ ఓ కుర్చీలో కూర్చుని ఉన్నట్లుగా తెలియజేస్తోంది. అబుదాబీలో ఉన్న తనకు ఏమైనా జరిగితే ఖతార్కి చెడ్డ పేరు వస్తుందనీ, తాను యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి అతిథినని చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఖతార్ ప్రజలు అమాయకులని అందులో షేక్ పేర్కొన్నారు. తనకు ఏం జరిగినా దానికి షేక్ మొహ్మద్ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు షేక్ అబ్దుల్లా.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









