యూఏఈలో ఖతారీ షేక్ నిర్బంధం
- January 16, 2018
దోహా: ఖతార్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడొకరు, తాను యూఏఈలో నిర్బంధానికి గురైనట్లు ఆరోపిస్తున్నారు. వివాదాస్పదుడిగా ఈ ఖతారీ షేక్పై ఆరోపణలున్నాయి. షేక్ అబ్దుల్లా బిన్ అలి అల్ థని, దోహాతో అబుదాబీ - రియాద్ సంబంధాలు తెంచుకున్నాక మీడియేటర్గా తెరపైకొచ్చారు. ఖతార్కి చెందిన అల్ జజీరా టెలివిజన్ ప్రసారం చేసిన వీడియోలో, షేక్ ఓ కుర్చీలో కూర్చుని ఉన్నట్లుగా తెలియజేస్తోంది. అబుదాబీలో ఉన్న తనకు ఏమైనా జరిగితే ఖతార్కి చెడ్డ పేరు వస్తుందనీ, తాను యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి అతిథినని చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఖతార్ ప్రజలు అమాయకులని అందులో షేక్ పేర్కొన్నారు. తనకు ఏం జరిగినా దానికి షేక్ మొహ్మద్ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు షేక్ అబ్దుల్లా.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







