జిసిసి భద్రతా ప్రమాణాలు లేని బొమ్మల స్వాధీనం
- January 19, 2018
మనామా: డైరెక్టరేట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ మిటియరాలజీ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ అండ్ టూరిజం 11,055 బొమ్మల్ని స్వాధీనం చేసుకుంది. జిసిసి భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో వీటిని స్వాధీనం చేసుకున్నారు. నీటిలో నానితే ఈ బొమ్మల సైజ్ డబుల్ అవుతుంది. కాబట్టి, ఇవి పొరపాటున కడుపులోకి వెళితే తీవ్రమైన ప్రమాదం వాటిల్లుతుంది. స్టాండర్డైజేషన్ అండ్ మిటియరాలజీ డైరెక్టర్ మోనా అలలావి మాట్లాడుతూ కొన్ని శాంపిల్స్ని పరీక్షలకు పంపించామనీ, అవి జిసిసి రెగ్యులేషన్కి విరుద్ధంగా ఉండటంతో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ తరహా బొమ్మల్ని కనుగొనేందుకోసం ప్రత్యేకంగా ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 50 దుకాణాల్లో తనిఖీలు జరిగాయి. తనిఖీల అనంతరం ఆయా షాప్ ఓనర్స్కి హెచ్చరికలు జారీ చేశారు. బొమ్మల్ని విక్రయించేవారు ఖచ్చితంగా నిబంధనల్ని పాటించాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









