మాన.. ప్రాణరక్షణ లేని కువైట్ దేశానికి వెళ్లవద్దని సూచిస్తున్న ఫిలిఫైన్ అధ్యక్షుడు
- January 20, 2018_1516454991.jpg)
కువైట్: ' బతికి ఉంటే ...బలుసాకు తిందాం ' కానీ కువైట్ లో ఉద్యోగాలు చేయనవసరం లేదని ..అక్కడకు వెళ్లవద్దని తమ దేశ పౌరులకు ఫిలిఫైన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కువైట్లో తమ పౌరులపై విచక్షణ రహిత రీతిలో దాడులు పెరిగిపోతున్నాయని ఫిలిఫైన్ విదేశాంగ కార్యదర్శి సిల్వస్టర్ బెలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ పౌరులు ఎంతో కష్టించి పనిచేస్తారని పైగా తమ దేశస్తులకు చక్కని ఇంగ్లీషు రావడంతో యూరప్ దేశాలు కూడా తమ వారికే ప్రాధాన్యమిస్తాయని బెలో చెప్పారు. అయితే మరే దేశంలో జరగని విధంగా ఈ మధ్య కాలంలో కువైట్లో ఇంటి పనులు పనులుచేస్తున్న తమ దేశ మహిళలపై కువైట్ లో లైంగికదాడులు జరుగుతున్నాయని బెలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసందర్భాల్లో లైంగికదాడులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని బెలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2లక్షల 50వేల మంది ఫిలిఫైన్ పౌరులు కువైట్లో పనిచేస్తున్నారని వారితో తమ దేశం రెండు వందల కోట్ల ఆదాయం అర్జిస్తోందని బెలో చెప్పారు. అయితే తమ పౌరుల భద్రత కంటే సంపాదన ముఖ్యం కాదని బెలో తేల్చిచెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!