400 డాలర్లను మార్చి, 500,000 దిర్హామ్లు గెల్చుకున్న మహిళ
- January 20, 2018
దుబాయ్:అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ - వింటర్ ప్రమోషన్ 2017 బంపర్ డ్రాలో ఓ మహిళ 500,000 దిర్హామ్లు గెల్చుకున్నారు. కిర్గిస్తాన్కి చెందిన ధ్జీన్బయీవా ఈ బంపర్ ఆఫర్లో విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో లైవ్గా ఈ బంపర్ డ్రాని తీశారు. అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ మేనేజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ (దుబాయ్) ప్రతినిథులు ఈ బంపర్ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. 500,000 దిర్హామ్ల డ్రీమ్ ప్రైజ్ని గెల్చుకోవడం పట్ల ధ్జీన్బయేవా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అల్ బర్షాలోని అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ బ్రాంచ్లో ఆమె 400 డాలర్లను ఎక్స్ఛేంజ్ చేశారు. బంపర్ డ్రాలో కిలో బంగారాన్ని ఇండియాకి చెందిన కుల్దీప్ సింగ్ గెల్చుకున్నారు. సెల్ఫీ కాంటెస్ట్లో ఐపాడ్ ప్రో, ఐఫోన్ఎక్స్ సహా పలు క్యాష్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!









