400 డాలర్లను మార్చి, 500,000 దిర్హామ్లు గెల్చుకున్న మహిళ
- January 20, 2018
దుబాయ్:అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ - వింటర్ ప్రమోషన్ 2017 బంపర్ డ్రాలో ఓ మహిళ 500,000 దిర్హామ్లు గెల్చుకున్నారు. కిర్గిస్తాన్కి చెందిన ధ్జీన్బయీవా ఈ బంపర్ ఆఫర్లో విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో లైవ్గా ఈ బంపర్ డ్రాని తీశారు. అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ మేనేజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ (దుబాయ్) ప్రతినిథులు ఈ బంపర్ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. 500,000 దిర్హామ్ల డ్రీమ్ ప్రైజ్ని గెల్చుకోవడం పట్ల ధ్జీన్బయేవా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అల్ బర్షాలోని అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ బ్రాంచ్లో ఆమె 400 డాలర్లను ఎక్స్ఛేంజ్ చేశారు. బంపర్ డ్రాలో కిలో బంగారాన్ని ఇండియాకి చెందిన కుల్దీప్ సింగ్ గెల్చుకున్నారు. సెల్ఫీ కాంటెస్ట్లో ఐపాడ్ ప్రో, ఐఫోన్ఎక్స్ సహా పలు క్యాష్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







