ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం ...
- January 20, 2018
ఢిల్లీ అగ్నిప్రమాదం 17మందిని సజీవ దహనం చేసింది. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాణాసంచా కర్మాగారంలో మంటలు అంటుకోగా.. భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 10కి పైగా ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశాయి. అర్థరాత్రికి కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మంటలు అదుపు చేసినా మృతదేహాల వెలికితీత, గుర్తింపు కష్టంగా మారింది.
భావన పారిశ్రామిక వాడలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాస్టిక్ గోడౌన్ పేరుతో బాణాసంచా తయారు చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. మరో అంతస్థులో రబ్బరు గోడౌన్ ఉండటంతో రబ్బరుకు మంటలు అంటుకొని.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇటు మంటలు, అటు దట్టమైన పొగతో భవనంలో చిక్కుకున్న కార్మికులు మృత్యువాత పడ్డారు. బిల్డింగ్ ఇరుకుగా ఉండటంతో తప్పించుకునే దారి లేకుండా పోయింది. చాలామంది కార్మికులు పొగకు ఊపిరాడక పడిపోవడంతో మంటలు అంటుకొని సజీవ దహనమయ్యారు. కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భవనంలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ప్రధాని మోడీ సైతం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు ఈ ఉదయానికి కొలిక్కి వచ్చాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







