ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం ...
- January 20, 2018
ఢిల్లీ అగ్నిప్రమాదం 17మందిని సజీవ దహనం చేసింది. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాణాసంచా కర్మాగారంలో మంటలు అంటుకోగా.. భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 10కి పైగా ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశాయి. అర్థరాత్రికి కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మంటలు అదుపు చేసినా మృతదేహాల వెలికితీత, గుర్తింపు కష్టంగా మారింది.
భావన పారిశ్రామిక వాడలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాస్టిక్ గోడౌన్ పేరుతో బాణాసంచా తయారు చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. మరో అంతస్థులో రబ్బరు గోడౌన్ ఉండటంతో రబ్బరుకు మంటలు అంటుకొని.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇటు మంటలు, అటు దట్టమైన పొగతో భవనంలో చిక్కుకున్న కార్మికులు మృత్యువాత పడ్డారు. బిల్డింగ్ ఇరుకుగా ఉండటంతో తప్పించుకునే దారి లేకుండా పోయింది. చాలామంది కార్మికులు పొగకు ఊపిరాడక పడిపోవడంతో మంటలు అంటుకొని సజీవ దహనమయ్యారు. కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భవనంలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ప్రధాని మోడీ సైతం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు ఈ ఉదయానికి కొలిక్కి వచ్చాయి.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!









