కర్నాటక బంద్ బంద్..
- January 24, 2018
బెంగళూరు: మహదాయి నదీ జలాలను తమ రాష్ట్రానికి పంపిణీ చేయించాలని డిమాండ్ చేస్తూ కర్నాటకలో గురువారం బంద్ ప్రారంభమైంది. గోవా-కర్నాటక మధ్య ఈ అంతరాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాద నేపథ్యంలో కర్నాటక రక్షణ వేదిక, వివిధ సంస్థలు రైతులు సంయుక్తంగా గురువారం బంద్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహదాయి నది మిగులు జలాలను గోవా ప్రభుత్వం సముద్రంలోకి వృథాగా వదిలేస్తోందని, ఆ జలాలను కర్నాటక రైతులకు పంపిణీ చేయించాలని ప్రధాని నరేంద్రమెడీని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. బంద్తో గురవారం కర్నాటకలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు తెరవలేదు. ఉదయం 6 గంటల నుండీ ప్రజా రవాణా వాహనాలు స్తంభించాయి. కర్నాటక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో బస్సులు నిలిచిపోయాయి టాక్సీలు, ఆటోలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూసివేశారు. బెంగళూరు మెట్రో సర్వీసులలో కొన్నింటిని మాత్రం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కర్నాటలో ఈ బంద్ కొనసాగుతుండగా బిజెపి అధ్యక్షులు అమిత్షా గురువారమే మైసూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం







