కర్నాటక బంద్ బంద్..
- January 24, 2018
బెంగళూరు: మహదాయి నదీ జలాలను తమ రాష్ట్రానికి పంపిణీ చేయించాలని డిమాండ్ చేస్తూ కర్నాటకలో గురువారం బంద్ ప్రారంభమైంది. గోవా-కర్నాటక మధ్య ఈ అంతరాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాద నేపథ్యంలో కర్నాటక రక్షణ వేదిక, వివిధ సంస్థలు రైతులు సంయుక్తంగా గురువారం బంద్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహదాయి నది మిగులు జలాలను గోవా ప్రభుత్వం సముద్రంలోకి వృథాగా వదిలేస్తోందని, ఆ జలాలను కర్నాటక రైతులకు పంపిణీ చేయించాలని ప్రధాని నరేంద్రమెడీని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. బంద్తో గురవారం కర్నాటకలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు తెరవలేదు. ఉదయం 6 గంటల నుండీ ప్రజా రవాణా వాహనాలు స్తంభించాయి. కర్నాటక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో బస్సులు నిలిచిపోయాయి టాక్సీలు, ఆటోలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూసివేశారు. బెంగళూరు మెట్రో సర్వీసులలో కొన్నింటిని మాత్రం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కర్నాటలో ఈ బంద్ కొనసాగుతుండగా బిజెపి అధ్యక్షులు అమిత్షా గురువారమే మైసూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







