కర్నాటక బంద్ బంద్..
- January 24, 2018
బెంగళూరు: మహదాయి నదీ జలాలను తమ రాష్ట్రానికి పంపిణీ చేయించాలని డిమాండ్ చేస్తూ కర్నాటకలో గురువారం బంద్ ప్రారంభమైంది. గోవా-కర్నాటక మధ్య ఈ అంతరాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాద నేపథ్యంలో కర్నాటక రక్షణ వేదిక, వివిధ సంస్థలు రైతులు సంయుక్తంగా గురువారం బంద్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహదాయి నది మిగులు జలాలను గోవా ప్రభుత్వం సముద్రంలోకి వృథాగా వదిలేస్తోందని, ఆ జలాలను కర్నాటక రైతులకు పంపిణీ చేయించాలని ప్రధాని నరేంద్రమెడీని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. బంద్తో గురవారం కర్నాటకలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు తెరవలేదు. ఉదయం 6 గంటల నుండీ ప్రజా రవాణా వాహనాలు స్తంభించాయి. కర్నాటక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో బస్సులు నిలిచిపోయాయి టాక్సీలు, ఆటోలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూసివేశారు. బెంగళూరు మెట్రో సర్వీసులలో కొన్నింటిని మాత్రం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కర్నాటలో ఈ బంద్ కొనసాగుతుండగా బిజెపి అధ్యక్షులు అమిత్షా గురువారమే మైసూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









