జీతాల్లేక దుర్భర జీవితం గడుపుతున్న కార్మికులు
- January 25, 2018
మనామా: జింజ్లోని ఓ కంపెనీ, కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. కరెంటు ఛార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కంపెనీలో కార్మికులు పనిచేస్తున్నారు. మూడు నెలల నుంచీ ఆ కంపెనీ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై కంపెనీ ప్రతినిథుల్ని సంప్రదించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్ (జిఎఫ్బిటియు) వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్లో పలు ప్రముఖ కంపెనీలు కూడా, తమ సంస్థల్లో పనిచేస్తున్నవారికి నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోతున్నట్లు తెలుస్తుంది. 100 మందికి పైగా ఉద్యోగులు గత 10 నెలలుగా వేతనాలు లేక నరకయాతన అనుభవిస్తున్నట్లు జిఎఫ్బిటియు అసిస్టెంట్ సెక్రెటరీ - ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







