జీతాల్లేక దుర్భర జీవితం గడుపుతున్న కార్మికులు

- January 25, 2018 , by Maagulf
జీతాల్లేక దుర్భర జీవితం గడుపుతున్న కార్మికులు

 మనామా: జింజ్‌లోని ఓ కంపెనీ, కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. కరెంటు ఛార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కంపెనీలో కార్మికులు పనిచేస్తున్నారు. మూడు నెలల నుంచీ ఆ కంపెనీ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై కంపెనీ ప్రతినిథుల్ని సంప్రదించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. జనరల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (జిఎఫ్‌బిటియు) వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్‌లో పలు ప్రముఖ కంపెనీలు కూడా, తమ సంస్థల్లో పనిచేస్తున్నవారికి నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోతున్నట్లు తెలుస్తుంది. 100 మందికి పైగా ఉద్యోగులు గత 10 నెలలుగా వేతనాలు లేక నరకయాతన అనుభవిస్తున్నట్లు జిఎఫ్‌బిటియు అసిస్టెంట్‌ సెక్రెటరీ - ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com