'రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ' : విజయశాంతి
- January 25, 2018
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం పనిచేస్తానని విజయశాంతి అన్నారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటనను ఉద్దేశించి రాష్ట్రంలో పవనే కాదు ఎవరైనా పర్యటన చేసుకోవచ్చని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత క్రియాశాల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి నేటికి 20 ఏళ్లు అవుతుందన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, అయితే రాహుల్ గాంధీ తనను ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని ఆమె చెప్పారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ అని అన్నారు. కెసిఆర్ పాలన బాగలేదనే ఫీడ్బ్యాక్ ఉందని అన్నారు. ఉద్యమం నాటి కెసిఆర్ వేరు ఇప్పటి కెసిఆర్ వేరు అని చెప్పారు. మీడియాకు ఫ్రీడం లేకుండా చేశారని, కోదండరామ్ను మాట్లాడకుండా చేస్తున్నారని అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి