ఎర్రని రంగు ఉన్న నీటిలో చేపల వేట వద్దని శాటిలైట్ల సూచన
- January 25, 2018_1516889677.jpg)
రస్ అల్ ఖైమా : సాంకేతికత సాగరాన్ని శాసిస్తుంది. దీని సహాయంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పడమే కాక నీటి రంగులను సైతం గుర్తించి ఆ మార్పు ప్రభావసంగా ఏమేమి ఉపద్రవాలు సంభవిస్తాయి సైతం శాస్త్రవేత్తలు పసిగట్టేస్తున్నారు. వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే శాటిలైట్ల చర్మవ్యాధులు వచ్చే ప్రాంతాలు చేపలు పట్టేవారికి, ఈత కొట్టేవారికి యూఏఈ వాతావరణ మార్పులు మరియు పర్యావరణ శాఖా హెచ్చరికలు జారీ చేసింది. స్పెషల్ ఎకానమిక్ జోన్ ప్రాంతమైన అరేబియన్ గల్ఫ్ పశ్చిమతీరం, ఒమన్ గల్ఫ్ పశ్ఛిమ తీరంలో సముద్రపు నీళ్లు ఎరుపుగా మారాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రతలో పలు మార్పులు ఏర్పడ్డాయి. దీంతో క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు నీళ్లలో కలవడంతో సముద్రంలో జీవసంబంధమైన చర్య ఏర్పడింది.. శైవలాల విడుదల వల్ల నీళ్లు ఎర్రగా మారాయి. ఈ చర్య కారణంగా సముద్రంలో సూక్ష్మ జీవులు పుడతాయి. ఈ సూక్షజీవులు వల్ల చేపలు, ఇతర సముద్రపు జీవులకు హానిలేకపోయినప్పటికీ మనుషులకు హానికరమని అధికారులు హెచ్చరించారు. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రంలోని ఈ మార్పును శాటిలైట్ల ద్వారా గుర్తించామని అధికారులు తెలిపారు. సముద్రం గులాబీ రంగులో మారిన ప్రాంతంలో ఎట్టి పరిస్థితిలో చేపలు పట్టవద్దని, ఈత కొట్టవద్దని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి