ఎర్రని రంగు ఉన్న నీటిలో చేపల వేట వద్దని శాటిలైట్ల సూచన
- January 25, 2018
రస్ అల్ ఖైమా : సాంకేతికత సాగరాన్ని శాసిస్తుంది. దీని సహాయంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పడమే కాక నీటి రంగులను సైతం గుర్తించి ఆ మార్పు ప్రభావసంగా ఏమేమి ఉపద్రవాలు సంభవిస్తాయి సైతం శాస్త్రవేత్తలు పసిగట్టేస్తున్నారు. వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే శాటిలైట్ల చర్మవ్యాధులు వచ్చే ప్రాంతాలు చేపలు పట్టేవారికి, ఈత కొట్టేవారికి యూఏఈ వాతావరణ మార్పులు మరియు పర్యావరణ శాఖా హెచ్చరికలు జారీ చేసింది. స్పెషల్ ఎకానమిక్ జోన్ ప్రాంతమైన అరేబియన్ గల్ఫ్ పశ్చిమతీరం, ఒమన్ గల్ఫ్ పశ్ఛిమ తీరంలో సముద్రపు నీళ్లు ఎరుపుగా మారాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రతలో పలు మార్పులు ఏర్పడ్డాయి. దీంతో క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు నీళ్లలో కలవడంతో సముద్రంలో జీవసంబంధమైన చర్య ఏర్పడింది.. శైవలాల విడుదల వల్ల నీళ్లు ఎర్రగా మారాయి. ఈ చర్య కారణంగా సముద్రంలో సూక్ష్మ జీవులు పుడతాయి. ఈ సూక్షజీవులు వల్ల చేపలు, ఇతర సముద్రపు జీవులకు హానిలేకపోయినప్పటికీ మనుషులకు హానికరమని అధికారులు హెచ్చరించారు. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రంలోని ఈ మార్పును శాటిలైట్ల ద్వారా గుర్తించామని అధికారులు తెలిపారు. సముద్రం గులాబీ రంగులో మారిన ప్రాంతంలో ఎట్టి పరిస్థితిలో చేపలు పట్టవద్దని, ఈత కొట్టవద్దని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







