యశ్చోప్రా పురస్కారం అందుకోనున్న ఆశాభోంస్లే
- January 27, 2018
ప్రముఖ దర్శకనిర్మాత యశ్చోప్రా పేరుతో సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేషనల్ యశ్చోప్రా మెమోరియల్ అవార్డును 2017కి గానూ ప్రముఖ నేపథ్యగాయని ఆశాభోంస్లేకు ప్రదానం చేయనున్నారు. పదేళ్లప్రాయంలో నేపథ్య గాయనిగా కెరీర్ను ప్రారంభించిన ఆశాభోంస్లే వందలాది చిత్రాల్లో వేలాది పాటలు పాడి చిత్ర పరిశ్రమకి సేవ చేశారు. ముంబయిలో ఫిబ్రవరి 16న జరిగే వేడుకలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావు, ప్రముఖ గాయని లతామంగేష్కర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆశాభోంస్లే స్వీకరిస్తారు. యశ్చోప్రాతో ఉన్న అనుబంధంతో ఆయన జ్ఞాపకంగా టి.సుబ్బిరామిరెడ్డి 2013 నుంచి సినీ ప్రముఖులకి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, లతామంగేష్కర్, రేఖ ఈ పురస్కారాన్ని అందుకొన్నవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







