యశ్‌చోప్రా పురస్కారం అందుకోనున్న ఆశాభోంస్లే

- January 27, 2018 , by Maagulf
యశ్‌చోప్రా పురస్కారం అందుకోనున్న ఆశాభోంస్లే

ప్రముఖ దర్శకనిర్మాత యశ్‌చోప్రా పేరుతో సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన నేషనల్‌ యశ్‌చోప్రా మెమోరియల్‌ అవార్డును 2017కి గానూ ప్రముఖ నేపథ్యగాయని ఆశాభోంస్లేకు ప్రదానం చేయనున్నారు. పదేళ్లప్రాయంలో నేపథ్య గాయనిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆశాభోంస్లే వందలాది చిత్రాల్లో వేలాది పాటలు పాడి చిత్ర పరిశ్రమకి సేవ చేశారు. ముంబయిలో ఫిబ్రవరి 16న జరిగే వేడుకలో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావు, ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆశాభోంస్లే స్వీకరిస్తారు. యశ్‌చోప్రాతో ఉన్న అనుబంధంతో ఆయన జ్ఞాపకంగా టి.సుబ్బిరామిరెడ్డి 2013 నుంచి సినీ ప్రముఖులకి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, లతామంగేష్కర్‌, రేఖ ఈ పురస్కారాన్ని అందుకొన్నవారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com