యశ్చోప్రా పురస్కారం అందుకోనున్న ఆశాభోంస్లే
- January 27, 2018
ప్రముఖ దర్శకనిర్మాత యశ్చోప్రా పేరుతో సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేషనల్ యశ్చోప్రా మెమోరియల్ అవార్డును 2017కి గానూ ప్రముఖ నేపథ్యగాయని ఆశాభోంస్లేకు ప్రదానం చేయనున్నారు. పదేళ్లప్రాయంలో నేపథ్య గాయనిగా కెరీర్ను ప్రారంభించిన ఆశాభోంస్లే వందలాది చిత్రాల్లో వేలాది పాటలు పాడి చిత్ర పరిశ్రమకి సేవ చేశారు. ముంబయిలో ఫిబ్రవరి 16న జరిగే వేడుకలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావు, ప్రముఖ గాయని లతామంగేష్కర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆశాభోంస్లే స్వీకరిస్తారు. యశ్చోప్రాతో ఉన్న అనుబంధంతో ఆయన జ్ఞాపకంగా టి.సుబ్బిరామిరెడ్డి 2013 నుంచి సినీ ప్రముఖులకి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, లతామంగేష్కర్, రేఖ ఈ పురస్కారాన్ని అందుకొన్నవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక