శంకర్ యొక్క ‘ఇండియన్ 2’
- January 27, 2018
లంచం కోసం పీడించేవాడు సొంత కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే అనే కాన్పెప్ట్తో ఆల్మోస్ట్ 22ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను ప్లాన్ చేశారు దర్శకుడు శంకర్. ఫస్ట్ పార్ట్లో హీరోగా నటించిన కమల్హాసన్నే ఈ సీక్వెల్లోనూ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్ను రిపబ్లిక్ డే సందర్భంగా దర్శకుడు శంకర్ తెలియజేశారు.
‘ఇండియన్ 2’ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు ‘హీలియమ్ బెలూన్’ను ఆయన తైవాన్లో ఎగురవేశారు. ఆ బెలూన్పై ‘ఇందియన్ 2’ అని తమిళంలో ‘ఇండియన్ 2’ అని ఇంగ్లిష్లో రాసి ఉంది. ఇలా రెండో భారతీయుడు తైవాన్లో స్టార్ట్ అయ్యాడన్నమాట. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘2.0’కి ఓ రచయితగా వ్యవహరించిన జయమోహన్ ‘భారతీయుడు 2’కి కూడా రైటర్గా చేయనున్నారట. వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- రేపే ఏపీకి ప్రధాని మోదీ..
- సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం
- మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!
- ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం..
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!







