కత్తెరతో పేగులను కత్తిరించుకుని ఆత్మహత్య యత్నం చేయబోయిన ప్రవాస భారతీయుడు
- January 28, 2018
కువైట్: ఆత్మహత్యలలోనూ వైవిధ్యం చూపించాలని కాబోలు ఆ ప్రవాసియ భారతీయడు వింతగా విషాదంగా జీవితాన్ని ముగించాలనుకొన్నాడు. ఒక పదునైన కత్తెరతో కడుపులో బలంగా పొడుచుకొని తన ప్రేగులను తానె పర పర మని కత్తెరతో కత్తిరించుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి కల్గిన విపరీతమైన నొప్పికి విలవిల్లాడిపోయాడు ఆ బాధకు తాళలేక బిగ్గరగా వామ్మో ..వాయ్యో అంటూ పోలికేకలు పెడ్తూ అటూ ఇటూ పరుగులు పెడ్తూ రక్షించండి బాబో అంటూ ఏడుపులంకించుకొన్నాడు. బాధితుని కేకలు విన్న పోలీసులు ఆ భారతీయ వ్యక్తిని అడాన్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈలోపున ఆ వ్యక్తి కడుపు నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఎంతో క్లిష్టమైన స్థితిలో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉండిపోయిన ఒక కత్తెర జతను తొలగించి ఎట్టకేలకు రక్షించారు. అనంతరం నిందితుడిపై దర్యాప్తు నిమిత్తం అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు, ఆ భారతీయ వ్యక్తిని ఫిన్టాస్ పోలీసు స్టేషన్ లో ఉంచారు అహ్మది ప్రాసిక్యూటర్ ఆదేశాలపై నిందితుడిపై ఆత్మహత్య ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









