కత్తెరతో పేగులను కత్తిరించుకుని ఆత్మహత్య యత్నం చేయబోయిన ప్రవాస భారతీయుడు
- January 28, 2018
కువైట్: ఆత్మహత్యలలోనూ వైవిధ్యం చూపించాలని కాబోలు ఆ ప్రవాసియ భారతీయడు వింతగా విషాదంగా జీవితాన్ని ముగించాలనుకొన్నాడు. ఒక పదునైన కత్తెరతో కడుపులో బలంగా పొడుచుకొని తన ప్రేగులను తానె పర పర మని కత్తెరతో కత్తిరించుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి కల్గిన విపరీతమైన నొప్పికి విలవిల్లాడిపోయాడు ఆ బాధకు తాళలేక బిగ్గరగా వామ్మో ..వాయ్యో అంటూ పోలికేకలు పెడ్తూ అటూ ఇటూ పరుగులు పెడ్తూ రక్షించండి బాబో అంటూ ఏడుపులంకించుకొన్నాడు. బాధితుని కేకలు విన్న పోలీసులు ఆ భారతీయ వ్యక్తిని అడాన్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈలోపున ఆ వ్యక్తి కడుపు నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఎంతో క్లిష్టమైన స్థితిలో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉండిపోయిన ఒక కత్తెర జతను తొలగించి ఎట్టకేలకు రక్షించారు. అనంతరం నిందితుడిపై దర్యాప్తు నిమిత్తం అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు, ఆ భారతీయ వ్యక్తిని ఫిన్టాస్ పోలీసు స్టేషన్ లో ఉంచారు అహ్మది ప్రాసిక్యూటర్ ఆదేశాలపై నిందితుడిపై ఆత్మహత్య ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







