ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న అనుష్కశర్మ
- January 29, 2018ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న హీరోయిన్!
హైదరాబాద్: సినిమాలోని పాత్ర కోసం కొందరు నటులు ఎంత శ్రమకైనా వెనుకాడరు. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది ఎక్కువగా కనపడుతుంటుంది. అయితే హీరోయిన్లు కూడా తక్కువేం కాదు. కథానాయకులకు దీటుగా వారూ కష్టపడుతుంటారు. ఇప్పుడు అనుష్కశర్మ కూడా కష్టపడుతోంది. అయితే అదేదో ఫిట్నెస్ కోసమో.. కత్తియుద్ధాల కోసమో కాదు. 'సుయి ధాగా' సినిమా కోసం సూదీ దారం పట్టింది.
దర్శకుడు శరత్ కఠారియా, నిర్మాత మనీష్ శర్మలు కలిసి తీసిన చిత్రం 'దమ్ లాగాకే హైషా' మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి వీరిద్దరి కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం 'సుయి ధాగా'. వరుణ్ధావన్, అనుష్కశర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకోగా, ఇప్పడు అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటోంది. ఈ మేరకు సినిమాలో ఆమె పాత్ర ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న అనుష్కశర్మ ఫొటోను యశ్రాజ్ ఫిల్మ్ అభిమానులతో పంచుకుంది.
గతేడాది డిసెంబరు 12న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్కశర్మ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో బిజీగా ఉండగా, అనుష్క శర్మ తన సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







