దుబాయ్లో కొత్త మిలియనీర్ ఓ ఇండియన్ టీచర్
- January 29, 2018
ఓ యాన్యువల్ డ్రా ఓ ఇండియన్ టీచర్ని బిలియనీర్గా మార్చేసింది. యూఏఈలో 19 ఏళ్ళ నుంచి టీచర్గా పనిచేస్తోన్న భారతీయ మహిళ అమృత జోషి, తన పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం కమర్షియల్ బ్యాంక్లో సేవింగ్స్ చేస్తున్నారు. ఆ కమర్షియల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ యాన్యువల్ డ్రాలో ఆమె ఎవరూ ఊహించని విధంగా 1 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. దాంతో ఆమె యూఏఈలో సరికొత్త మిలియనీర్గా అవతరించారు. బంపర్ డ్రాలో తాను 1 మిలియన్ దిర్హామ్లు గెలుచుకున్న విషయం గురించి సమాచారం అందుకున్న ఆమె, ఆ అనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నట్లు చెప్పారు. ఈ సొమ్ముతో, తన పిల్లలకు ఇంకా మెరుగైన విద్య, జీవనం అందించగలుగుతానని ఆమె అన్నారు. దుబాయ్కి చెందిన అల్యూమినియం ఫ్యాక్టరీ కార్మికుడు జహిర్ల్ ఇస్లామ్ కబీర్, డిసెంబర్లో జరిగిన డ్రాలో 100,000 దిర్హామ్లు గెల్చుకున్నారు. ఈ బహుమతి తన జీవితాన్ని మార్చేసిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్లో దీని విలువ 2 మిలియన్ బంగ్లాదేశీ టాకాలతో సమానమని ఆయన అన్నారు. తమ బ్యాంకు వినియోగదారులు గణనీయంగా పెరుగుతున్నారనీ, వారిని మరింత సంతోషపరిచేందుకు ఈ తరహా డ్రాలు నిర్వహిస్తున్నామని రిటెయిల్ బ్యాంక్ గ్రూప్ హెడ్ షకెర్ జైనాల్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!







