దుబాయ్లో కొత్త మిలియనీర్ ఓ ఇండియన్ టీచర్
- January 29, 2018
ఓ యాన్యువల్ డ్రా ఓ ఇండియన్ టీచర్ని బిలియనీర్గా మార్చేసింది. యూఏఈలో 19 ఏళ్ళ నుంచి టీచర్గా పనిచేస్తోన్న భారతీయ మహిళ అమృత జోషి, తన పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం కమర్షియల్ బ్యాంక్లో సేవింగ్స్ చేస్తున్నారు. ఆ కమర్షియల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ యాన్యువల్ డ్రాలో ఆమె ఎవరూ ఊహించని విధంగా 1 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. దాంతో ఆమె యూఏఈలో సరికొత్త మిలియనీర్గా అవతరించారు. బంపర్ డ్రాలో తాను 1 మిలియన్ దిర్హామ్లు గెలుచుకున్న విషయం గురించి సమాచారం అందుకున్న ఆమె, ఆ అనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నట్లు చెప్పారు. ఈ సొమ్ముతో, తన పిల్లలకు ఇంకా మెరుగైన విద్య, జీవనం అందించగలుగుతానని ఆమె అన్నారు. దుబాయ్కి చెందిన అల్యూమినియం ఫ్యాక్టరీ కార్మికుడు జహిర్ల్ ఇస్లామ్ కబీర్, డిసెంబర్లో జరిగిన డ్రాలో 100,000 దిర్హామ్లు గెల్చుకున్నారు. ఈ బహుమతి తన జీవితాన్ని మార్చేసిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్లో దీని విలువ 2 మిలియన్ బంగ్లాదేశీ టాకాలతో సమానమని ఆయన అన్నారు. తమ బ్యాంకు వినియోగదారులు గణనీయంగా పెరుగుతున్నారనీ, వారిని మరింత సంతోషపరిచేందుకు ఈ తరహా డ్రాలు నిర్వహిస్తున్నామని రిటెయిల్ బ్యాంక్ గ్రూప్ హెడ్ షకెర్ జైనాల్ చెప్పారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







