64 కేజీల అతిపెద్ద బంగారు ఉంగరంలో 5.1 కేజీల విలువైన వజ్రాలు
- January 29, 2018
షార్జా: పుచ్చకాయ అంతటి అతిపెద్ద ఉంగరం. బరువు అక్షరాలా 64 కేజీలు మాత్రమే .ప్రపంచంలోనే అతిపెద్ద్ ఈ ఉంగరం పేరు 21 క్యారట్ నజ్మత్ తైబా మరో పేరు స్టార్ ఆఫ్ తైబా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉంగరమని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం ఇచ్చింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న జ్యూయలరీ వ్యాపార సంస్థ తైబాకు చెందిన ఉంగరం ఇది. 64 కేజీల బరువున్న ఈ ఉంగరాన్ని 5.1 కేజీల విలువైన వజ్రాలు, ఖరీదైన రంగురాళ్లతో అలంకరించారు. 2000 సంవత్సరంలో 55 మంది స్వర్ణకారులు 45 రోజుల్లో 450 గంటలపాటు కష్టపడి తయారు చేశారు. ఈ వజ్రాన్ని తయారు చేయించిన వ్యక్తికి అప్పట్లో రూ. 3 కోట్ల 47 లక్షలకు ఈ ఉంగరం కోసం వెచ్చించాడు. ప్రస్తుతం దీని ధర దాదాపు రూ.19 కోట్లకు పైగా ధర పలుకుతుంది. ఈ ఉంగరాన్ని షార్జా నగరంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శనకు ఉంచారు. రానున్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా షార్జాలోని ఎవరైనా ఎన్నారైలూ వీలైతే కొనుక్కోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







