సౌదీఅరేబియాలోని అల్ సవర్మ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం
- January 29, 2018
రియాద్:సౌదీఅరేబియాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మృతిచెందడంతో విషాదం నెలకొంది. చనిపోయినవారిలో ఓ గర్భణి, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒక వివాహానికి హాజరవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నైరుతి సౌదీఅరేబియాలోని అల్ సవర్మ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కును మరో ట్రక్కు లాకొస్తూ రోడ్డెక్కింది. వెనుకనున్న ట్రక్కుకు లైట్లు వెలగకపోవడంతో పెళ్ళి వేడుకులకు వెళ్తున్న కారు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో వెనుకనున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి పేర్కొంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది . ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కోల్పోయి జీవచ్ఛం మాదిరిగా ఆ తండ్రి రోడ్డు రవాణా శాఖాపై కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తానని విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









