సౌదీఅరేబియాలోని అల్ సవర్మ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం
- January 29, 2018
రియాద్:సౌదీఅరేబియాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మృతిచెందడంతో విషాదం నెలకొంది. చనిపోయినవారిలో ఓ గర్భణి, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒక వివాహానికి హాజరవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నైరుతి సౌదీఅరేబియాలోని అల్ సవర్మ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కును మరో ట్రక్కు లాకొస్తూ రోడ్డెక్కింది. వెనుకనున్న ట్రక్కుకు లైట్లు వెలగకపోవడంతో పెళ్ళి వేడుకులకు వెళ్తున్న కారు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో వెనుకనున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి పేర్కొంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది . ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కోల్పోయి జీవచ్ఛం మాదిరిగా ఆ తండ్రి రోడ్డు రవాణా శాఖాపై కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తానని విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







