సౌదీఅరేబియాలోని అల్ సవర్మ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం
- January 29, 2018
రియాద్:సౌదీఅరేబియాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మృతిచెందడంతో విషాదం నెలకొంది. చనిపోయినవారిలో ఓ గర్భణి, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒక వివాహానికి హాజరవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నైరుతి సౌదీఅరేబియాలోని అల్ సవర్మ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కును మరో ట్రక్కు లాకొస్తూ రోడ్డెక్కింది. వెనుకనున్న ట్రక్కుకు లైట్లు వెలగకపోవడంతో పెళ్ళి వేడుకులకు వెళ్తున్న కారు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో వెనుకనున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి పేర్కొంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది . ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కోల్పోయి జీవచ్ఛం మాదిరిగా ఆ తండ్రి రోడ్డు రవాణా శాఖాపై కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తానని విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







